• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

E.G: ఇటీవల హాస్పటల్స్‌లో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం సీఎం సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 61 మందికి రూ.37,19,880 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు కాగా చెక్కులను శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:19 PM IST

కే.రామభద్రపురం కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసీ

PPM: ప్రభుత్వ వైద్యం పేదలకు వరమని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా మెలగాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం కొమరాడ(మం) కే.రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

February 20, 2026 / 07:17 PM IST

తడి పొడి చెత్తను వేరు చేయడంపై శిక్షణ

AKP: సబ్బవరం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు తడి పొడి చెత్తను వేరు చేయడంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇనుము ప్లాస్టిక్ అట్టపెట్టెలు కాగితాలు తదితర వాటిని పొడి చెత్తగా పరిగణిస్తారని ఆర్.డబ్ల్యూ.ఎస్ కన్సల్టెంట్ లోవరాజు, కార్యదర్శి ఆనందరావు అన్నారు. సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించాలని సూచించారు.

February 20, 2026 / 07:15 PM IST

అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన హుస్సేన్ బాషా (22) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం ఓ యువకుడి మృత దేహం ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 20, 2026 / 07:12 PM IST

సంకల్ప కళా గ్రామంలో ఫ్లీట్ రివ్యూ ప్రతినిధుల సందడి

VSP: భారతీయ నౌకాదళం నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా పెందుర్తి సమీపంలోని సంకల్ప కళా గ్రామంలో సహజరంగుల అద్దకంపై కార్యశాల నిర్వహించారు. నేవీ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విదేశీ ప్రతినిధులు చేనేత ఉత్పత్తులు, లక్క బొమ్మలు, సంప్రదాయ ఆహార తయారీ విధానాలను వీక్షించారు.

February 20, 2026 / 07:09 PM IST

ప్రతిపక్షాలపై అక్రమ కేసులు: రూత్ రాణి

GNTR: మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును శుక్రవారం గుంటూరులోని ఆయన నివాసంలో పొన్నూరు మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ డా. రూత్ రాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు.

February 20, 2026 / 07:05 PM IST

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యే విరాళం

ప్రకాశం: కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుని కనిగిరి అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు శుక్రవారం శీలవారిపల్లి గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్‌లో నూతనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తమ వంతు సహాయ సహకారాలు కావాలని కోరారు. దీంతో ఆయన అంబేద్కర్ విగ్రహానికి రూ. 1,01,116 రూపాయలు అందజేస్తానని వెల్లడించారు.

February 20, 2026 / 07:05 PM IST

2వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా: సీపీఎం

KDP: ఖాజీపేట మండలంలో సుమారు 2వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామీణ ల్యాండ్ మాఫియా కబ్జా చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ ఆరోపించారు. శుక్రవారం జరిగిన ‘భూ సదస్సు’లో ఆయన మాట్లాడుతూ.. 10 గ్రామాల్లో కబ్జాలకు గురైన ఈ భూములను అధికారులు వెంటనే కాపాడాలని, కబ్జాదారులకు రాజకీయ పార్టీల అండ ఉందని విమర్శించారు.

February 20, 2026 / 07:04 PM IST

రబీ సీజన్లో శనగలకు మద్దతు ధర రూ. 5,875 వేలు

తూ.గో జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో రైతులు పండించిన శనగలను కనీస మద్దతు ధర క్వింటా ఒక్కింటికి రూ. 5,875 వేల చొప్పున కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టినట్లు జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ దేవరపు ప్రతాప్ శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా RBK వద్ద శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుటకు నిర్ణయించామన్నారు. పూర్తి వివరాలకు RBK కేంద్రాల్లో సంప్రదించాలన్నారు.

February 20, 2026 / 07:01 PM IST

ప్రారంభమైన చెన్నకేశవ స్వామి ఉత్సవాలు

సత్యసాయి: పుట్టపర్తిలోని పెద్ద కమ్మవారిపల్లిలో శ్రీ చెన్నకేశవ స్వామి, పోతలయ్య, బంగారు లింగమయ్య వార్షిక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. దారపునేని చంద్రశేఖర్ నివాసం నుంచి స్వామివారి వెండి కవచాలను ఉరుము, డప్పు వాయిద్యాల మధ్య పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు యలువగంప మహోత్సవం నిర్వహించారు.

February 20, 2026 / 07:00 PM IST

జగన్‌తో కలిసి ప్రయాణించిన శింగనమల నేతలు

ATP: YSR కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి విజయవాడ నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు వ్యక్తిగత పర్యటనలో భాగంగా వీరు వెళ్లినట్లు తెలుస్తోంది. విమాన ప్రయాణంలో నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై జగన్ చర్చించినట్లు సమాచారం.

February 20, 2026 / 07:00 PM IST

ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలి: MLA

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో మెప్మా సహకారంతో సారీ రోలింగ్ షాపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి షాపును ఓపెన్ చేశారు. పొదుపులో వచ్చే రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుణాలను అందజేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలన్నారు.

February 20, 2026 / 07:00 PM IST

పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్

కృష్ణా: గుడూరు పరిధిలోని చిట్టిగూడూరు గ్రామ శివారులో ఎస్సై దివ్య ప్రకాష్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.16,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 20, 2026 / 06:55 PM IST

రేపు కోయిలకుంట్లలో పర్యటించనున్న మంత్రి

NDL: రేపు కోయిలకుంట్ల పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇవాళ వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. కోయిలకుంట్ల పట్టణంలో ఉదయం 10 గంటలకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం స్వర్ణాంధ్ర, స్వచంద్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని ఆయన అన్నారు.

February 20, 2026 / 06:55 PM IST

‘మనమిత్ర వాట్సప్ గవర్నెస్‌పై విస్తృత అవగాహన కల్పించాలి’

కర్నూలు: రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేపట్టిన మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

February 20, 2026 / 06:54 PM IST