పార్వతీపురం(మం) నర్సిపురంలోని ఓ వీధిలో రహదారి మధ్యలోనే విద్యుత్తు స్తంభం ఉండటం స్థానికులకు ఇబ్బందిని కలిగిస్తోంది. రోడ్డు, కాలువల పనులు జరిగినప్పటికీ స్తంభాన్ని మార్చకుండా వదిలేయడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించి స్తంభాన్ని పక్కకు తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.