GNTR: తెనాలి రత్నా కళ్యాణ మండపంలో ఈ నెల 31న ‘మా-ఏపీ’ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘అష్ట దిగ్గజాలకు కీర్తి కిరీటం’ పేరిట వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులను సత్కరించనున్నారని దర్శకుడు దిలీప్ రాజ తెలిపారు. కలెక్టర్ అన్సారియా ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ సహా పలువురికి పురస్కారాలు అందజేయనున్నారు.