• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గుడివాడలో విస్తృతంగా పర్యటించిన కమీషనర్

కృష్ణా: గుడివాడ పురపాలక కమిషనర్ ఎస్. మనోహర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఏఈ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, సచివాలయ సిబ్బందితో కలిసి కర్మికానగర్, సాయినగర్, చెంచుపేట ప్రాంతాలలో పర్యటించారు. శనివారం ఉదయం స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను సమీక్షించి, లీకేజీలు ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

February 21, 2026 / 07:34 AM IST

కనిగిరిలో యదేచ్చగా భూముల కబ్జా’

మార్కాపురం జిల్లా కనిగిరిలో దళితుల భూమిని రాత్రిపూట ఫినిషింగ్ రాళ్లతో అక్రమంగా కబ్జా చేశారని స్థానిక దళితులు ఆరోపిస్తున్నారు. ఈ భూ-కబ్జాపై ల్యాండ్ గ్రాబింగ్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ శాఖలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

February 21, 2026 / 07:32 AM IST

పరవాడలో షటిల్ బ్యాట్మెంటన్ పోటీలు ప్రారంభం

AKP: పరవాడ మండలం తానాం గ్రామంలో శుక్రవారం రాత్రి షటిల్ బ్యాట్మెంటన్ పోటీలను మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. గ్రామంలో పరదేశిమాంబ జాతర సందర్భంగా పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు తగిన ప్రోత్సహం అందించినందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 07:32 AM IST

అరకు ఎన్టీఆర్ జంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్

అల్లూరి: శుక్రవారం రాత్రి అరకు ఎన్టీఆర్ జంక్షన్ వద్ద రోడ్ అవేర్నెస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని సీఐ ఎల్.హిమగిరి తెలిపారు. వాహన తనిఖీలు నిర్వహించారు. కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురై, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. క్షేమంగా గమ్య స్థానాలకు చేరేందుకు డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.

February 21, 2026 / 07:31 AM IST

ELR: వ్యభిచార గృహంపై పోలీసుల ఆకస్మిక దాడి

ELR: ద్వారకతిరుమల మండలం గొల్లగూడెంలో నిర్వహిస్తున్న వ్యభిచారం గృహంపై ఎస్సై సుధీర్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. ఎస్సై మాట్లాడుతూ.. పంచవ నాగమణి, భర్త సునీల్ గృహంలోనే విటులను రప్పించి అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారంతో ఇద్దరూ విటులను, ఒక బాధితురాలను అదుపులోకి తీసుకున్నామన్నారు.

February 21, 2026 / 07:28 AM IST

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

NTR: గత రెండు నెలల క్రితం టీడీపీ సీనియర్ కార్యకర్త ఇప్పిలి రాంబాబు గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా రూ.10,000 / చెక్కును నిన్న అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చిన తమను సంప్రదించాలని రాంబాబు కుటుంబ సభ్యులను కోరారు.

February 21, 2026 / 07:27 AM IST

సైబర్ నేరాలపై గూడూరులో అవగాహన

KRNL: గూడూరు నగర పంచాయతీ SC కాలనీలో SI రాజ కుళ్లాయప్ప సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, IVRS కాల్స్, నకిలీ రుణాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అనుమానిత కాల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు.

February 21, 2026 / 07:26 AM IST

అంజలి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు: డీఎస్పి

అన్నమయ్య: ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న కులవర్ధన్ తల్లి అంజలిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర శుక్రవారం తెలిపారు. కేసు అత్యంత దారుణంగా జరిగినదని, మైనర్ బాలికను పరిగణనలోకి తీసుకోకుండా అగంతకుడు కులవర్ధన్ బాలికను హత్యకు గురిచేశాడని పేర్కొన్నారు. చట్టం తన పని తానే చేస్తుందన్నారు.

February 21, 2026 / 07:26 AM IST

విద్యుత్ సరఫరాకు అంతరాయం

W.G: నరసాపురం సబ్ స్టేషన్లో అత్యవసర మరమ్మతుల దృష్ట్యా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ మధుకుమార్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాయపేట, మొగల్తూరు రోడ్డు, జేసీకిలి స్కూల్ ఏరియా, దేవునితోట, సబ్ కలెక్టర్ బంగ్లా, మున్సిపల్ ఆఫీస్ రోడ్డు, మూడు బొమ్మల సెంటర్, క్రిస్టియన్ పేట, కప్పలపేట ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందని తెలిపారు.

February 21, 2026 / 07:26 AM IST

నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10:30 గంటలకు జరగనుంది. నగరంపాలెంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ కిస్ట్రినా అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

February 21, 2026 / 07:26 AM IST

వైసీపీపై MLA ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్

PLD: భగవంతుడితో ఆటలాడినందుకే వైసీపీ పతనానికి బాటలు పడ్డాయని శుక్రవారం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ప్రజాస్వామ్యానికి వైసీపీ ఒక చీడ పురుగు లాంటిదని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారని, తన దిగజారుడు రాజకీయాలకు శాసనమండలిని వేదికగా వాడుకుంటున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 21, 2026 / 07:24 AM IST

వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి: మాజీ సీఎం

KDP: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ CM,YS జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తాడేపల్లిలో ఉపాధ్యాయ MLC,YCP రామచంద్రారెడ్డి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉపాధ్యాయుల తరఫున పోరాటాలు చేస్తున్నామని జగన్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు.

February 21, 2026 / 07:20 AM IST

నేటి నుంచి నీటి సరఫరాకు అంతరాయం

SKLM: పొందూరు మండలం రెల్లిగడ్డ వద్ద ఉన్న మంచినీటి పైపులు మరమ్మతులకు గురైనట్లు పంచాయతీ ఈవో పొన్నాడ జగదీశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున నేటి నుంచి నాలుగు రోజులు పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. మరమ్మతుల అనంతరం యధావిధిగా సరఫరా ఉంటుందన్నారు.

February 21, 2026 / 07:20 AM IST

నేడు ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక

ATP: గుత్తి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శనివారం ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, తెలిపారు. వారు మాట్లాడుతూ.. 2024 ఏప్రిల్, 1వ తేదీ నుంచి 2025 మార్చి, 31వ తేదీ వరకూ మండలంలోని 24 పం చాయతీలలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి సామాజిక తనిఖీలు నిర్వహించారన్నారు.

February 21, 2026 / 07:19 AM IST

‘ఉద్యోగుల గ్రీవెన్స్‌ను ఉద్యోగులు వినియోగించుకోవాలి’

అల్లూరి: ప్రతినెలా 3వ శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల గ్రీవెన్స్‌ను ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో లోకేశ్వరరావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఉద్యోగుల గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యలతో వచ్చిన రెవెన్యూ, సచివాలయ శాఖల ఉద్యోగుల నుంచి అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

February 21, 2026 / 07:18 AM IST