E.G: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరావు (72) తాజాగా మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 16కు చేరింది. కల్తీ పాలు తాగడంతో ఆయన రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు కొండబాబు (64) అనే వ్యక్తి మాత్రమే కోలుకున్నారు. పాలను నిల్వ చేసే ఫ్రీజర్లో ఇథిలీన్ గ్లైకాల్ కలవడంతోనే ఈ ఘోరం జరిగింది.