GNTR: పినపాడు గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు కొండ్రు సాయి కుమార్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. జనసేన పార్టీ తరఫున రూ.5,00,000 ప్రమాద బీమా పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.