GNTR: అకాల ఈదురు గాలులతో కూడిన వర్షాలు గత రెండు రోజులుగా కురుస్తున్న కారణంగా కాకుమాను మండలంలో ఎకరాల కొద్దీ సాగు చేసిన మొక్కజొన్న పంట నేలకూలిపోయింది. పంట పూర్తిగా పడిపోవడంతో దిగుబడి తీవ్రంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.