ప్రకాశం: టంగుటూరులో ఆదివారం జరిగిన లారీ అసోసియేషన్ సమావేశానికి మంత్రి స్వామి హాజరయ్యారు. ట్యాక్స్ను చెల్లింపు, ఆర్టీఏ నిబంధనలతో తీవ్రంగా నష్టపోతున్నామని సరైన వ్యాపారాలు లేక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నామని లారీ అసోసియేషన్ సభ్యులు మంత్రికి తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి, తన వంతు సహాయం చేస్తానని అసోసియేషన్ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు.