• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మల్లన్న సేవలో కార్మిక శాఖ మంత్రి

NDL: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటంతో మంత్రిని ఘనంగా సత్కరించారు.

February 21, 2026 / 07:18 AM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే సమీక్ష

సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి (CHC)ని నేడు ఉదయం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సందర్శించనున్నారు. ఆసుపత్రిలో అమలవుతున్న బయోమెడికల్ వ్యర్థాల బార్కోడ్ సిస్టమ్‌ను పరిశీలించడంతో పాటు రోగులతో మాట్లాడి పరిశుభ్రతపై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. శానిటేషన్ సిబ్బందితో వ్యర్థాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు.

February 21, 2026 / 07:17 AM IST

రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు

BPT: పిట్టలవానిపాలెం మండలంలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. చందోలు ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో వాహనదారుల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.

February 21, 2026 / 07:17 AM IST

శిథిలావస్థకు చేరుకున్న మంచినీటి ట్యాంకు

AKP: కోటవురట్ల మండలం పాములవాకలో 40,000 లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది. నేడో, రేపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. తక్షణం దీనిని తొలగించి కొత్త ట్యాంకు నిర్మించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా గ్రామంలో కొత్త వీధికి పైప్ లైన్ల నిర్మాణం సరిగా జరగకపోవడంతో తాగునీరు అందడం లేదు.

February 21, 2026 / 07:09 AM IST

సైబర్ నేరాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించిన సీఐ

VZM: బొబ్బిలి రూరల్ CI ఎస్.శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం తెర్లాం మండలం గోపాలవలసలో సైబర్‌ నేరాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు అకౌంట్‌, ఆధార్‌ నంబర్లు, OTPలు గుర్తుతెలియని వారికి చెప్పకూడదన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.

February 21, 2026 / 07:04 AM IST

రౌడీ షీటర్లపై అప్రమత్తంగా ఉండండి : ఎస్పీ

KDP: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని SP నచికేత్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జమ్మలమడుగు, పులివెందుల సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న రౌడీ షీటర్లు, ట్రబుల్ మేకర్స్‌పై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

February 21, 2026 / 07:04 AM IST

KRNL: ఇవాళ నుంచే ప్రత్యేక ఆధార్ శిబిరం..!

KRNL: కర్నూలు డివిజన్ పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో మాధవనగర్ లోని నారాయణ ఈ టెక్నో పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవాళ నుంచి 24వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు కర్నూలు డివిజన్ తపాలా శాఖ ప్రధాన పర్యవేక్షకులు జనార్దన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ శిబిరం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.

February 21, 2026 / 07:04 AM IST

విద్యార్థులకు బిగ్ అప్డేట్..!

WG: ఈనెల 23 సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్ఎస్ఐవో జి.ప్రభాకరరావు తెలిపారు. జిల్లాలో 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 37,841 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో జనరల్ విభాగం నుంచి 34,150 మంది, ఒకేషనల్ నుంచి 3,691 మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు.

February 21, 2026 / 07:04 AM IST

డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె

VSP: సహకార సంఘాల ఉద్యోగులు తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె బాట పట్టారు. శుక్రవారం డీసీసీబీ బ్యాంకు నుంచి పద్మనాభం జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వారు పదవీ విరమణ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.

February 21, 2026 / 07:00 AM IST

పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమం

CTR: ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ ప్రాంత ప్రజల భద్రత, పలు అంశాలపై అవగాహన, పోలీసులు ప్రజల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమము ఉద్దేశమన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

February 21, 2026 / 06:52 AM IST

రాయచోటిలో మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు పట్టివేత

అన్నమయ్య: రాయచోటిలో కర్ణాటకకు చెందిన మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు నసీర్‌ను సంయుక్త పోలీస్ ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. అతనిపై 26 కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ చర్యలో అన్నమయ్య ఎస్పీ ధీరజ్ చొరవకు ప్రశంసలు లభించాయి. స్థానికంగా తప్పుడు పేరుతో నివసిస్తున్నట్టు విచారణలో తేలినట్లు ఎస్పీ తెలిపారు.

February 21, 2026 / 06:46 AM IST

తిరుపతిలో నేడు పవర్ కట్

TPT: తిరుపతి నగరంలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా ఉండదని ఈఈసీ గంగాధరరెడ్డి తెలపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు న్యూమారుతీ నగర్, అమరావతి నగర్, ఎల్బీ నగర్, మహిళా యూనివర్సిటీ ఏరియా, ఎయిర్పోర్ట్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 21, 2026 / 06:45 AM IST

చేబ్రోలులో ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

GNTR: చేబ్రోలు మండల పరిధిలో అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు MLA ధూళిపాళ్ల నరేంద్ర శుక్రవారం ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. మృతి చెందిన నలుగురు వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1.50 లక్షల చొప్పున, మొత్తం రూ. 6 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

February 21, 2026 / 06:42 AM IST

గుర్తుతెలియని వృద్ధురాలు మృతి

TPT: తొట్టంబేడు 2 టౌన్ పరిధి చెన్నై రోడ్డులోని MGM ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వృద్ధురాలు అపస్మారక స్థితిలో ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆమెను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈమె ఆచూకీ తెలిసినవారు శ్రీకాళహస్తి టౌన్ పోలీస్ స్టేషన్‌కు సంప్రదించాలని సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు.

February 21, 2026 / 06:40 AM IST

చికిత్స పొందుతూ యువకుడు మృతి

AKP: ఎస్ రాయవరం మండలం తిమ్మాపురంలో ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. నక్కపల్లి మండలానికి చెందిన కొల్లి సురేంద్ర(19) ద్విచక్ర వాహనంపై వెళుతూ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు.

February 21, 2026 / 06:39 AM IST