W.G: శక పురుషుడు శాలివాహనుడి జయంతిని జిల్లాలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సొసైటీ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చక్రవర్తి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గురుజుకోట రాకేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.