MBNR: సీసీకుంట మండలం అమ్మాపురం గ్రామంలోని శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో ఇవాళ హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో రూ.9,37,740 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖ పర్యవేక్షకుడు శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగిస్తామని అధికారులు పేర్కొన్నారు.