TPT: ఏర్పేడు(M) పంగూరు గ్రామంలో దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి రూ.10 లక్షలు మంజూరు చేయడంతో.. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ఈ ప్లాంట్ను సర్పంచ్ లక్ష్మీ ప్రసన్న గ్రామస్థులతో కలిసి ప్రారంభించారు. ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల పంగూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.