ప్రకాశం: మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు బుధవారం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి దేవాలయ ఇన్స్పెక్టర్ ఆర్కే చైతన్య పర్యవేక్షణలో 91 రోజుల ఆదాయం లెక్కించారు. మొత్తం రూ.10,81,510 వచ్చాయని కార్యనిర్వహణాధికారి గొలమూరు శ్రీనివాసరెడ్డి తెలిపారు.