KMM: నగరంలోని స్ధానిక బస్ డిపో రోడ్లో ఉన్న జిల్లా గ్రంథాలయంలోని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. ఈ మేరకు జిల్లా గ్రంథాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాఠకులకు, విద్యార్దులకు అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. ఈ తనిఖీ సందర్భంలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీజ ఉన్నారు.