NZB: అసెంబ్లీలో ఇందిరపై తన వ్యాఖ్యల పట్ల దుమారం రేగడంపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి స్పందించారు. ‘ఇందిరా గాంధీ ఉక్కుమహిళ, ఆమెఅంటే మాకు గౌరవమే.. నేను తప్పేమీ మాట్లాడలేదు. అనేక పథకాలకు ఇందిరమ్మ పేరుపెట్టారు. ఇప్ప సారా తయారుచేస్తే ఆమె పేరుమాత్రం పెట్టొద్దనే చెప్పా, క్షమాపణ చెప్పాల్సి వస్తే చెప్తా, తమాషాచేయొద్దని మంత్రి నన్ను బెదిరిస్తున్నారా?’ అన్నారు.