ASR: జీ.మాడుగుల మండలంలో ఆదివాసి సత్యాగ్రహ యాత్ర 136వ రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా పెదలోచలి, గొడుగుమమిడి, వంతల గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలు నిర్వహించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగాల నియామకానికి ప్రత్యేక చట్టం చేయాలని ఆదివాసి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.