PPM: అకాల వర్షాలు కారణంగా నష్ట పోయిన మొక్కజొన్న రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేసారు. ఆదివారం పాచిపెంట(మం) పాంచాలి, మోసురు, మాతుమూరు గ్రామాలలో నేలకొరిగిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఎకరాకు రూ. 40 వేలు పెట్టుబడి పెట్టి, పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్ళు వర్షం వలన పూర్తిగా నష్ట పోయారన్నారు.