• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ‘జనతా వారధి’

E.G: రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మాజీ కార్పోరేటర్ రేలంగి శ్రీదేవి, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఏసు పాల్గొని ప్రజల నుంచి మంచినీటి సమస్యలు, ఫీజు రియంబర్స్‌మెంట్, పింఛన్ల తదితర సమస్యలపై వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

February 20, 2026 / 01:38 PM IST

‘అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తు పనులు పూర్తి చేయాలి’

KDP: అలగనూరు రిజర్వాయర్ మరమ్మతు పనులు త్వరితగన పూర్తి చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో అలగనూరు రిజర్వాయర్ గురించి ప్రస్తావించారు. ఆరు నియోజకవర్గాల్లో 92 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉందన్నారు.

February 20, 2026 / 01:35 PM IST

గోస్పాడులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: గోస్పాడు మండలంలో ఇవాళ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. నెహ్రు నగర్ గ్రామంలో వైసీపీ కార్యకర్త వివాహ వేడుకల్లో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలను తెలియజేశారు.

February 20, 2026 / 01:35 PM IST

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలు దరఖాస్తులు ఆహ్వానం

KKD: ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత కోటాలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని MEO గీతాదేవి సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి ప్రవేశాల కోసం ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థి అన్ని పత్రాలు సమర్పించాలన్నారు.

February 20, 2026 / 01:33 PM IST

‘అనుమానాస్పద వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి’

TPT: వరదయ్యపాలెం ఎస్సై మల్లికార్జున్ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల అనుమానాస్పద కదలికలు పెరగడంతో రాత్రివేళల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులతో సమాచారం పంచుకోవద్దని, వాహనాలు వెలుతురు ఉన్న ప్రదేశాల్లోనే పార్క్ చేయాలని చెప్పారు. అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ 9440900725 కు సమాచారం ఇవ్వాలన్నారు.

February 20, 2026 / 01:32 PM IST

నవశక్తి దేవతల ఆలయ సముదాయం పునఃప్రారంభం

VSP: భీమిలి నియోజకవర్గంలోని శ్రీ నవశక్తి దేవతల ఆలయముల సముదాయం పునఃప్రారంభ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 4వ వార్డ్ కార్పొరేటర్ దవులపల్లి కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరమ్మ హాజరయ్యారు.

February 20, 2026 / 01:30 PM IST

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

TPT: ఎర్పేడు సమీపంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సెక్యూరిటీ నర్స్‌–01, ఇన్‌స్ట్రుమెంట్ టెక్నీషియన్‌–02 పోస్టులు కలిపి మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి. ఇతర వివరాల కోసం https://www.iittp.ac.in/Outsourced_Positions వెబ్‌సైట్ చూడాలన్నారు.

February 20, 2026 / 01:28 PM IST

‘అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలి’

E.G: అసంఘటిత రంగ కార్మికులకు భద్రత కరువైందని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయు జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నల్లజర్లలో మండల బజారు జట్టు వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం జరిగింది. పాలకవర్గాలకు ఓట్లు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమంపై లేకపోవడం బాధాకరమన్నారు.

February 20, 2026 / 01:26 PM IST

గుత్తిలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

ATP: గుత్తి పట్టణ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బసీనేపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి పని నిమిత్తం గుత్తికి బైక్ మీద వచ్చాడు. బైక్ అదుపుతప్పి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 01:23 PM IST

సామాజిక న్యాయం పటిష్టంగా అమలు చేయాలంటూ నిరసనలు

SKLM: సామాజిక న్యాయం పటిష్టంగా అమలు చేయాలంటూ శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సంపద పంపిణీలో అందరికీ సమానంగా జరగాలని జిల్లా పార్టీ నాయకులు తిరుపతిరావు అన్నారు. కార్మికులకు పనిగంటలు తగ్గించి తగిన వేతనాన్ని చెల్లించాలన్నారు. సంఘాల నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 01:21 PM IST

యూరియా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు

CTR: పుంగనూరు పట్టణంలోని చంద్రకాంత్ వీధిలో యూరియా కోసం ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలైన్‌లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్క రైతుకు ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అధికారులు సకాలంలో రైతులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

February 20, 2026 / 01:19 PM IST

అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలకు జిల్లా యువకుడు ఎంపిక

విజయనగరానికి చెందిన తెలికిచెర్ల శ్రీతోద్భవ్ షిల్లాంగ్లో ఈ నెల 23 నుండి 27 వరకు జరిగే ఇస్రో NSSS 2026 అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనున్నారు. తాను రాసిన పరిశోధనాత్మక వ్యాసం ” సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ త్రూ కాస్మిక్ లైఫ్ విసబిలిటీ మెట్రిక్” అనే అంశంపై ఇస్రో, పలువురు అంతర్జాతీయ, అంతరిక్ష పరిశోధకులకు వివరించబోతున్నారు.

February 20, 2026 / 01:18 PM IST

పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీపీవో

VZM: జిల్లా పంచాయతీ అధికారి డి. వి.మల్లిఖార్జున శుక్రవారం కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. స్వర్ణ పంచాయతీ ఇంటి పన్నుల బకాయిలు 2025, 26 వరకు సంబంధించి రూ 1.48 లక్షలు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ 65 లక్షలు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. పంచాయతీ షాపుల అద్దెలు బకాయిలు ఉన్నాయని, త్వరలో వసూలుకు చర్యలు చేపడతామన్నారు. ఈఓపీఆర్డీ ఉన్నారు.

February 20, 2026 / 01:15 PM IST

‘వచ్చే నెల 31 లోపు దరఖాస్తులు చేసుకోవాలి’

VZM: మెరకముడిదాం మండలంలోని స్దానిక గర్భం AP మోడల్‌ స్కూల్లో 2026- 27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ అరుణకుమారి శుక్రవారం. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 24 నుంచి వచ్చే నెల 31లోపు www.apms.apcfss.in వైబ్‌ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ 12 తేదిన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

February 20, 2026 / 01:15 PM IST

‘మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి’

AKP: అచ్యుతాపురం మండలంలోని పూడిమడక జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఎస్సై సుధాకర్ విద్యార్థులకు డ్రగ్స్, మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి వంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. అనుమానాస్పద సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి, మోసాలకు గురికావద్దని హెచ్చరించారు.

February 20, 2026 / 01:08 PM IST