విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని, విద్యార్థులు తమ ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తి, తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.