SRD: కంది పరిధిలోని ఐఐటి హైదరాబాద్లో ఆదివారం సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐఐటి ప్రొఫెసర్లు విద్యార్థులు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మూర్తి పాల్గొన్నారు.