CTR: పలమనేరు అర్బన్ బోడిరెడ్డిపల్లిలో శ్రీ సీతారాముల దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ, మహా కుంభాభిషేక కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరి సహకారంతో నిర్మించిన ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లాలని కోరారు. మహా పూర్ణాహుతి, కుంభాభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.