SKLM: భూగర్భజలాలు పరిరక్షణ మనందరి బాధ్యతని భూగర్భజల శాఖ సహాయ సంచాలకులు(RTD) దుప్పల లక్ష్మణరావు అన్నారు. ప్రపంచ జలదినోత్సవ వేడుకలు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏజీవి అయినా సజీవంగా జీవించాలంటే జలమే ఆధారమని, ప్రతీఒక్కరూ జలసంరక్షణకు శక్తివంచన లేకుండా పాటుపడాలన్నారు. నీటిని దుర్వినియోగంచేస్తే భవిష్యత్ తరాలకు నీరుండదన్నారు.