కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు పరిష్కరించడంలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ.. ఈ ఘనత సాధించడంలో జిల్లా యంత్రాంగం, సిబ్బంది కృషి అభినందనీయమని అన్నారు. ఈ విజయం జిల్లాకు గర్వకారణమని ఆయన కొనియాడారు.