KRNL: ఆదోని పట్టణంలో ఆస్తి పన్ను పాత బకాయిలపై ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ మాఫీని వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ ప్రజలను ఇవాళ కోరారు. ఈ రాయితీ ఈనెల 30 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. గడువు సమీపిస్తున్నందున సెలవు రోజుల్లోనూ నగదు కౌంటర్లు తెరిచి ఉంటాయని, బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమీషనర్ వెల్లడించారు.