KRNL: తుగ్గలి మండలం సీజీ తండా పంచాయతీలోని చెరువు తండా గ్రామంలో రూ.26.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే శ్యాం కుమార్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.