సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అట్రాసిటీ కేసుల పురోగతిపై SP సతీష్ కుమార్ కమిటీకి వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ప్రత్యేక ‘గ్రీవెన్స్’ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఆర్టీఓ కరుణాసాగర్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.