NLR: తమ సమస్యలు పరిష్కరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మత్స్యకార సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు. మంగళవారం డీపీఆర్ నివాసంలో ఆయనను కలిశారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల బోట్లు సరిహద్దుల్లోకి రాకుండా ప్రభుత్వం ఇరువు రాష్ట్రాలతో చర్చలు జరపాలన్నారు. మత్స్యకారులకు 50 బోట్లు కొనుగోలుకు 20 శాతం సబ్సిడీ కల్పించాలన్నారు.