E.G: కోరుకొండ మండలం కణుపూరులో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సిఫార్సుతో మంజూరైన CMRF చెక్కులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదగా బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. గ్రామానికి చెందిన కంచు మూర్తి నూకాలమ్మకి రూ 27,100, కొత్తపల్లి రత్న కుమారికి రూ.77,084 విలువగల CMRF చెక్కులను అందజేశామన్నారు.