ప్రకాశం: అర్ధవీడులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినీలకు ఆర్థిక అక్షరాస్యతపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో కళాజాత రూపంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ గురువారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థినీలు చదువుతో పాటు బ్యాంకులో పొదుపు అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.