సత్యసాయి: గుడిబండ మండలంలోని వీరజ్జనపల్లి, మోరుబగల్, వడ్రహట్టి, ఉప్పరహట్టి గ్రామాల్లో జరుగుతున్న రహదారులు, కల్వర్టుల నిర్మాణ పనులను ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డా. శ్రీనివాస మూర్తి పరిశీలించారు. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు సహకారంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. వీటి వల్ల వర్షాకాలంలో ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు.