E.G: గోకవరం(M) గుమ్మలదొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వైభవంగా శంకుస్థాపన జరిగింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన నిధుల నుంచి రూ. 15 లక్షలు కేటాయించగా, ఎంపీపీ గల్లా కృష్ణ, గళ్ళ రాము కొబ్బరికాయ కొట్టి ఈ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.