తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కరకంబాడి రోడ్డు సుబ్బారెడ్డి నగర్లోని వెంకీ జిమ్ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు రుయా ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న దీప్తి చరిష్మా (39)గా గుర్తించారు. ఆమె కరకంబాడి నుంచి విధులకు స్కూటీపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.