AKP: నర్సీపట్నంలో శ్రీ నూకాలమ్మ తల్లి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు జాగారం సందర్భంగా ఎస్సీ కాలనీ నుంచి ప్రారంభమైన గరగల ఊరేగింపు పట్టణ వీధుల గుండా భక్తి పరవశంలో సాగింది. డప్పుల మోగింపు, కోలాట నృత్యాలతో సందడి నెలకొంది. భక్తులు పసుపు నీళ్లతో అర్ఘ్యమిస్తూ అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. కాగా, ఈ నెల 17న పెద్ద జాగారం, 18న ప్రధాన జాతర నిర్వహించనున్నారు.