SKLM: ఎచ్చెర్ల మండలం దోమాం పంచాయితీలోని రోడ్డు రాళ్లు తేలి అధ్వానంగా తయారయింది. ఈ గ్రామస్తులు తోటపాలెం, కొత్తపేట, శ్రీకాకుళం వెళ్లడానికి ఈ మార్గాన్నే ఉపయోగిస్తారు. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని, ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.