VSP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజనను నిలిపివేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. జనగణన పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియను అమలు చేయవద్దని పిటీషనర్లు కోరారు. వారి తరపున సీనియర్ న్యాయవాదులు కేఎస్ మూర్తి, జీఏల్ నరసింహరెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం సమయం కోరడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ కీలకంగా మారింది.