NDL: రంజాన్, ఉగాది పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మంత్రి ఫరూక్ గురువారం పిలుపునిచ్చారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యాన్ని పాటిస్తూ.. గొడవలకు దూరంగా ఉండి కుటుంబాలతో ఆనందంగా పండుగలు జరుపుకోవాలని మంత్రి సూచించారు.