NDL: మహానంది గ్రామ సమీపంలోని అయ్యన్నగర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కాశీశ్వరి అంత్యక్రియలకు గాను భగత్ సింగ్ యూత్ సభ్యులు రూ.18 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం కాశీశ్వరి అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేద కుటుంబమైన వారిని ఆదుకునేందుకు యూత్ సభ్యులు మహేష్, చంద్ర, శివలు చందాల రూపంలో రూ.18 వేలు ప్రోగు చేసి అంత్యక్రియలకు అందజేశారు.