ఉమ్మడి ప.గో. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం కావాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేసి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని జడ్పీ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఛాంబర్లో ఆమె అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లాను ఆదర్శ జిల్లా పరిషత్గా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.