SKLM: ఆమదాలవలసలో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందిన హనుమంతు ప్రసాద్ (70) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఛాతిలో నొప్పి ఉందని కుటుంబ సభ్యులకు తెలపడంతో స్థానిక వైద్యులకు సమాచారం అందించారు. ఆమదాలవలసలోని ఆయన స్వగృహానికి వైద్యులు చేరుకునే సరికి ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.