ప్రకాశం: సింగరాయకొండలో ఎస్సీ హాస్టల్ మరమ్మతు పనులను మంత్రి స్వామి సోమవారం పరిశీలించారు. పనుల నాణ్యతపై ఆరా తీశారు. నాణ్యతలో రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. పనులు జాప్యం జరగకుండా త్వరగా పూర్తి చేసేలా చూడాలని అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యత ఉంటేనే విద్యార్థులకు రక్షణగా ఉంటుందని పేర్కొన్నారు.