GNTR: తాడేపల్లి పరిధిలోని పెనుమాకలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ‘రాధే’ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎస్.వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఇతని వెనుక మంగళగిరికి చెందిన దిలీప్, శ్రీకాంత్ ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.10,200 నగదు, ఫోన్పేలో ఉన్న రూ.49 వేలు స్వాధీనం చేసుకున్నారు.