CTR: ఆర్బీఐ సౌజన్యంతో చిత్తూరు విడ్స్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బృందం వెదురుకుప్పం మండలంలో వెలుగు సంఘ సభ్యులతో అవగాహన శిబిరం నిర్వహించింది. సివిల్ స్కోర్ నిర్వహణ, డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ భద్రతతో పాటు ప్రధాన మంత్రి భీమా,పెన్షన్ పథకాలపై వివరించారు. తక్కువ ప్రీమియంతో సామాజిక భద్రత పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.