CTR: వీకోట వ్యవసాయ మార్కెట్ యార్డులో దుకాణాల వద్ద ఉన్న తూనికల యంత్రాల్లో తేడా వస్తే కేసులు తప్పవని జిల్లా తూనికల కొలతల శాఖ అసిస్టెంట్ కమిషనర్ స్వామి హెచ్చరించారు. మార్కెట్ యార్డ్లోని మండీలను ఆయన తనిఖీ చేశారు. తూనికలు శాఖ ప్రమాణాలను నిర్ధారిస్తూ యంత్రాలకు సీలు వేస్తామని, వాటిని తొలగించి మోసం చేసి పట్టుబడితే కేసు నమోదు చేస్తామన్నారు.