GNTR: కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులు, కార్మికులకు నష్టదాయకమని AIKMS జాతీయ కార్యదర్శి బి. భాస్కర్ అన్నారు. గుంటూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.