కోనసీమ: ‘కేడర్ విత్ లీడర్’ కార్యక్రమం రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అధ్యక్షతన తాటిపాక జీఎస్ గార్డెన్స్లో నిర్వహించబడింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను పార్టీ నాయకులతో కలిసి స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.