కృష్ణా: నందివాడ మండలం రుద్రపాక జిల్లా పరిషత్ పాఠశాలలో 1989,1990 సంవత్సర 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 36 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థులు కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను వారు నెమరేసుకున్నారు. చదివిన సమయంలో చేసిన అల్లర్లు, ఉపాధ్యాయులతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.