BPT: ప్రజల భద్రతే తమ ప్రథమ కర్తవ్యమని బాపట్ల రూరల్ సీఐ ప్రభాకర్ స్పష్టం చేశారు. కొత్త తరహా దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. షాపుల్లో ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. గంజాయి లాంటి అసాంఘిక కార్యకలాపాలపై 112కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ నిబంధన అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.