ELR: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, డా.బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద గల ఆర్టీసీ డిపో గ్యారేజీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.