KDP: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో కోర్టు ఉద్యోగి భక్తుల మధుసూదన్ రావు (47) మృతి చెందినట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహంరాజు తెలిపారు. CI వివరాలు.. సిద్ధవటం అటవీ చెక్పోస్ట్ సమీపంలో ఆదివారం సాయంత్రం సిద్ధపటం కోర్టు నందు లోక్ అదాలత్ సెక్షన్లో రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రావు బైకుపై బద్వేల్కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు.