PLD: జిల్లాలోని రైస్ మిల్లర్లు స్థానికంగా పండిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని JC సంజన సిన్హా సూచించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ నుంచి వచ్చే ధాన్యాన్ని చెక్ పోస్టుల ద్వారా కట్టడి చేయాలన్నారు. మిల్లర్లు ప్రతిరోజూ కొనుగోలు వివరాల నమోదు, రవాణా వాహనాలకు GPS అమర్చాలని సూచించారు.